ఎన్నికల రాబోతున్న సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం లబ్ధి చేకూరేలా కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు డిఎలను ప్రకటిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎన్నికల ప్రకటన విడుదల అయ్యేలోపు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం భారీగానే లబ్ధి చేకూరుతుందట. ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒకటి జులై నెల జీతంతో కూడిన మరొక డిఏను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.


అసెంబ్లీ పార్లమెంట్లు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గతంలో దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు డిఏ ప్రకటించారు.. ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న తరుణంలో అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా త్వరలోనే ఎలక్షన్ కోడ్ కూడా అమలులోకి రాబోతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే అవకాశం ఉంటుందని భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అందుకు సంబంధించి చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది.


ఒకటి రెండు రోజులలో ఎన్నికల ప్రకటన కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగించి నిర్ణయాలను మాత్రమే ఏపీ సీఎం తీసుకుంటున్నారు. అలాగే అంగన్వాడీలకు కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది 42 రోజులపాటు సమ్మె చేసినప్పటికీ వారి జీతాలను కూడా చెల్లించే బోతున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు.. డిసెంబర్ 12వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు అంగన్వాడీలు సమ్మె చేయడంతో దాదాపుగా 42 రోజులపాటు ఈ సమ్మె కొనసాగించారు. ఈ వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లను కూడా పరిష్కరించారు. ఇలా ఎన్నికలు రాబోతున్న సమయంలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: