సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మహేష్ బాబు చాలా గ్యాప్ తరువాత ఫుల్ లెంగ్త్ కామెడీ పండించి తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలకపాత్రలో నటించింది. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో, సూపర్ స్టార్ మహేష్ తో పాటు సరిలేరు యూనిట్ మొత్తం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని ఎన్నుకోవడం తన జీవితంలో తీసుకున్న అతి గొప్ప నిర్ణయంగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఇటీవల మహేష్ మాట్లాడుతూ చెప్పారు. 

 

ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ని వెళ్లిన మహేష్ బాబు, తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మహర్షి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ తొలిసారిగా ఒక గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు టాక్. మహేష్, దిల్ రాజు కలిసి ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని, కాగా రెండవ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని రెండు రోజుల క్రితం ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. 

 

ఇటీవల అఖిల్ సరసన మజ్ను, అలానే రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిన నిధి, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను దర్శకుడు వంశీ ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ, శృతి హాసన్ ల పేర్లు వినపడుతున్నాయి. అయితే నిధి ఎంపికైన విషయమై ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇది నిజమే కనుక అయితే, ఆమె రొట్టి విరిగి నేతిలో పడ్డట్లే మరి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: