పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటించి బాగా డబ్బులు సంపాదించాలని ఇప్పటికే మూడు సినిమాలకు ఒప్పుకున్నాడు. ఇంకా రెండు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్ చిత్రాల షూటింగు కొంచెం కూడా పూర్తి అవలేదు. కరోనా వైరస్ కారణంగా ఈ రెండు చిత్రాలు పూర్తయ్యేసరికి చాలా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. సినిమా చిత్రీకరణలు త్వరలో ప్రారంభం అయినా... అవి పూర్తయ్యే వరకు ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు. విరూపాక్ష అనే పీరియడిక్-డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా... పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ స్థాయిలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అనగా ఒకటి మంచి పాత్రలో మరొకటి దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. 


సాధారణంగా ఎటువంటి సినిమాలు తెరకెక్కించాలంటే దర్శకులంతా గ్రాఫిక్స్ పైన ఆధార పడతారు. జాగర్లమూడి మాత్రం శాతకర్ణి సినిమా లాగా గ్రాఫిక్స్ అవసరం లేకుండానే కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకొని వాటిలో చిత్రీకరణ జరపాలని చూస్తున్నాడు. మన పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ దాటి ఎక్కడికి రాను అని భీష్మించుకు కూర్చున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో ఎవరికైనా కరోనా సోకితే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ డైరెక్టర్లకు చెప్తున్నాడు. దీంతో ముందస్తుగా వేసుకున్న దర్శకనిర్మాతల ప్లాన్స్ అన్ని చిన్నాభిన్నం అవుతున్నాయి. నివేదికల ప్రకారం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి చిత్రం కంటే ముందస్తుగా హరీష్ శంకర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. 


ఇకపోతే ఒక వేళ పవన్ కళ్యాణ్ విరూపాక్ష సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టయితే జాగర్లమూడి తెలుగు దర్శకులలో టాప్ ప్లేస్ లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ పాపులారిటీ సంపాదించడానికి క్రిష్ జాగర్లమూడి బాగా తపన పడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ తన ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. 2021 వ సంవత్సరంలోనైనా విరూపాక్ష సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: