గతేడాది ‘ఖైదీ'(తమిళ్) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ అధినేత రాధా మోహన్ నిర్మించిన చిత్రం కావడంతో.. ‘ఒరేయ్ బుజ్జిగా’ పై క్రేజ్ ఏర్పడింది. అక్టోబర్ 2న ఆహా లో విడుదలైన ఈ చిత్రం.. ప్రస్తుతం లాభాల బాట పట్టినట్టు సమాచారం. 4 కోట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు ఆహా వారు. ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలైన రోజునే ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా విడుదలయ్యింది.
ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం కూడా ‘ఒరేయ్ బుజ్జిగా’ కు హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. అలా అని ఈ చిత్రానికి కూడా పాజిటివ్ రివ్యూలు అయితే రాలేదు. కానీ ఈ చిత్రమే కాస్త బెటర్ అన్నట్టు ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఏదైతేనేం ఈ రకంగా రాజ్ తరుణ్ ఓ హిట్టు కొట్టినట్టే..! ఇక ఇలాంటి ఆసక్తికరమైన సినిమా ల గురించి కొత్త కొత్త అప్ డేట్స్ తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..