నిజం చెప్పాలంటే జనవరి ఎండింగ్లోనే అంటే ఇప్పటికే క్రాక్ ఓటీటీ లో విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్ల విన్నపం మేరకు ‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక మరో హిట్ మూవీ ‘రెడ్’ కూడా అతి త్వరలో ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం మాత్రం ఓటిటి రిలీజ్ లేదని సమాచారం అందుతుంది.
ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను..సినిమా ప్రారంభమైనప్పుడే జెమినీ వారికి అమ్మేసారట నిర్మాతలు. దీంతో ఇక ఓటిటి రిలీజ్ ఉండదని.. డైరెక్ట్ గా ఛానల్ వారు ప్రీమియర్ ను టెలికాస్ట్ చేసినప్పుడే చూడాలని స్పష్టమవుతుంది. అయితే థియేటర్ లలోనే ఈ సినిమాని చూడనప్పుడు ఓటిటి లో ఎవరు చూస్తారాని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి