టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ కూడా మరొక హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య భారీ రేంజ్ లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. దీని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కెరీర్ 30వ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇటీవల తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయినప్పటికీ ఎవరూ భయపడవలసింది ఏమి లేదు, డాక్టర్ల పర్యవేక్షణలో తాను చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటున్నట్లు ఒక పోస్ట్ చేసారు ఎన్టీఆర్. ఆ వార్త విన్న పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్, సినిమా ప్రముఖులు, తారక్ త్వరగా కోలుకోవాలి అంటూ గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ విషయమై స్పందిస్తూ, ఇందాకే తారక్ తో ఫోన్ లో మాట్లాడాను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. అలానే తన కుటుంబసభ్యులు అందరితో కలిసి ఆయన హ్యాపీగా గడుపుతున్నట్లు తెలుసుకున్నాను, అది విన్నాక నాకు ఎంతో సంతోషంగా అనిపించింది, ఆయన కరోనా బారి నుండి త్వరలోనే కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది .... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: