
కరోనా సెకండ్ వేవ్ తో కరోన కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.ఆ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. వీటితో పాటు సినిమాల షూటింగ్లు నిలిచిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి పాన్-ఇండియన్ సినిమాల వరకు అన్నీ వాయిదా పడ్డాయి. 'రాధే శ్యామ్' సినిమా విడుదల కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని ప్రేమకథగా పేరుపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30 న థియేటర్లలోకి రానుంది అని మూవీ టీం ఎప్పుడో ప్రకటించారు.
కానీ, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానున్నాయి. దీంతో విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.అయితే ప్రభాస్ మాత్రం దానికి అసలు ఒప్పుకోవట్లేదట. ఆయన ఎలాగేనా ఈ సినిమాని ముందు చెప్పిన తేదీకి తీసుకొని రావాలని చూస్తున్నాడు అని దీనికోసం నిర్మాతలని ఒత్తిడి చేస్తున్నారు అని టాక్.ఇంకా ఆలస్యం అయితే సినిమా మీద అంచనాలు తగ్గిపోతాయి అని ప్రభాస్ భావన అంట. ఈ సినిమాకి నిర్మాతలుగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కి బంధువులే అవ్వడంతో ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక అయితే పరిస్థితి చక్కబడితే అనుకున్న తేదీకి కాకపోయినా ఈ ఏడాది దసరాకు సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో విడుదల కానుంది అని టాక్.అలాగే ఈ సినిమాని జీ5 లో థియేటర్స్ లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో కూడా మూవీ టీం ఉన్నారు అని టాక్. అయితే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.