వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగవ సీజన్ లో అభిజిత్ విజేతగా నిలవగా.. థర్డ్ ప్లేస్ లో నిలిచిన సోహెల్ పాతిక లక్షల ప్రైజ్ మనీ తో బయటికి వచ్చారు. రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలిచారు. అయితే బిగ్ బాస్ లో గెలవని అఖిల్ తాజాగా "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 ఆన్-టీవీ" కాంటెస్టులో మాత్రం విజేతగా నిలిచారు. ప్రస్తుతం మాటీవీ లో బిగ్‌బాస్ 4 కి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరోపక్క సీజన్ 5 ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.


గతేడాది కరోనా సమయంలోనూ బిగ్‌బాస్ షో ప్రారంభించి దిగ్విజయంగా పూర్తిచేశారు. అయితే ఈసారి కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సీజన్ 5 ప్రారంభించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు తహతహలాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ సాయంత్రం వేళ ఇళ్ళలోనే ఉంటున్నారు. కొత్త సినిమాలు ఏమీ కూడా టీవీలో ప్రసారం కావడం లేదు. ఈ క్రమంలోనే తమ షో ప్రారంభిస్తే టీఆర్పీ రేటింగ్ బాగా వస్తుందని నిర్వాహకులు భావిస్తూ.. సాధ్యమైనంత త్వరగా సీజన్ 5 తో ప్రేక్షకుల ముందుకు రావాలని కృషి చేస్తున్నారు.



అయితే తాజా నివేదికల ప్రకారం.. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం కంటెస్టెంట్ లకు సంబంధించిన ప్రాథమిక జాబితాను తయారు చేసేసిందట. ఆ కంటెస్టెంట్లను జూమ్ వీడియో కాల్ అప్లికేషన్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా చేస్తోందట. ప్రతిరోజు ముగ్గురు కంటెస్టెంట్ల చొప్పున జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని సమాచారం. అయితే మరో వారం రోజుల లోపు కంటెస్టెంట్స్ ఫైనలైజ్ చేసి వారికి సంబంధించిన లిస్టుని తయారీ చేయనుందని తెలియవచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అనుమతించే ముందు… కంటెస్టెంట్లను క్వారెంటైన్‌లో రెండు వారాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసిన మా టీవీ యాజమాన్యం సీజన్ లాంచింగ్ డేట్ కి ముందుగానే కంటెస్టెంట్స్ ఎలక్షన్ ప్రోసెస్ ని పెట్టింది అని తెలుస్తోంది. అయితే జూన్ నెలలో ఎట్టి పరిస్థితులలో సీజన్ 5 ప్రారంభించాలని మా టీవీ దృఢంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఈసారి విన్నర్ ప్రైజ్ మ‌నీ కూడా భారీగా పెంచుతారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: