టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు విలన్ గా, హీరోగా ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివాజీరాజా. మొదట్లో హీరో, విలన్ వేషాలు వేసి తనదైన గుర్తింపు దక్కించుకొని ఆ తర్వాత కాలం మారుతున్న కొద్ది ట్రెండ్ కు తగ్గట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకున్నారు. శివాజీరాజా మా ఎలక్షన్స్ సమయంలో ఆయన చేసిన రచ్చ కి అందరి దృష్టిలో మరొకసారి పడ్డారు.  కొన్ని రోజులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు శివాజీరాజా. అయితే ఆయన సినిమాల కంటే ఎక్కువగా ఇలాంటి వివాదాలతోనే పాపులారిటీ సంపాదించారు. సీనియర్ నటుడు నరేష్ తో ఆయనకు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

గత మా ఎలక్షన్ లలో ఓడిపోయినా శివాజీ రాజా ఆ తరువాత తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.  ఇటీవలే ఒక సినిమా కార్యక్రమంలో మెరిశాడు. అయితే ఈ కార్యక్రమంలో చూసిన వారంతా శివాజీరాజా కి ఏమైంది? ఇలా మారిపోయాడు ఏంటి?  అని తెగ ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. బాగా బరువు తగ్గి సన్నగా ఒక్కసారిగా కనిపించేసరికి అందరూ షాక్ తింటున్నారు. శివాజీ రాజా కు ఏదైనా జబ్బు వచ్చిందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

400 కు పైగా సినిమాల్లో నటించిన శివాజీ రాజా బుల్లితెరపై కూడా తనదైన స్టైల్ లో ప్రేక్షకుల అలరిస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతోమంది ఆత్మీయులను కలిగివున్న శివాజీ రాజాకు హీరో శ్రీకాంత్ అత్యంత సన్నిహిత వ్యక్తి ఆయన హీరోగా నటించిన ఈ సినిమాలో తన కొడుకును కీలక పాత్రలో నటించి సినిమాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ సినిమా తర్వాత ఈ సినిమాలో కూడా ఆయన కొడుకు కనిపించలేదు. తాజాగా ఆయన కొడుకు వినయ రాజా హీరో గా ఎంట్రీ ఇస్తున్న వేయి శుభములు కలుగు నీకు అనే సినిమా సాంగ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఓ ఫోటోలో బరువు తగ్గి చిక్కిపోయి కనిపించడంతో అందరి దృష్టి పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: