మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరు.. ఈ సినిమా అనంతరం మలయాళ చిత్రం లూసిఫర్ రిమేక్ 'గాడ్ ఫాదర్' లో నటించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ప్రస్తుతం ఆచార్య షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉండటంతో.. ఆ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు చిరంజీవి. మరికొద్ది రోజుల్లోనే ఈ షూటింగ్ పూర్తి కానుంది.ఆ వెంటనే గాడ్ ఫాదర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు చిరు. ఇక తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాకి సంబంధించిన నటీ నటుల ఎంపిక విషయంలో దర్శకుడు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సినిమాలో పలు కీలక పాత్రల్లో నటించడం కోసం వివిధ భాషల నుంచి పాపులర్ సెలెబ్రిటీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సినిమాలో కీలక పాత్ర కోసం కోలీవుడ్ అగ్ర నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించిందట చిత్ర యూనిట్.అయితే ఆ పాత్రకు ఓకే చెప్పిన సేతుపతి..రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట.దీంతో మేకర్స్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చిరంజీవి విజయ్ సేతుపతితో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందిగా సేతుపతిని చిరు రిక్వెస్ట్ చేస్తే..ఆ పాత్ర కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం ఉండటంతో చిరంజీవి చెప్పినంత కాకుండా.. కొంతవరకు తన రెమ్యునరేషన్ ని విజయ్ సేతుపతి తగ్గించుకున్నాడట.

అయితే గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో మెరిసాడు సేతుపతి.మళ్ళీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి.ఇక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి ఓ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాని తక్కువ సమయంలో పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్..ఇక సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: