ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.ఒకవైపు సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూనే మరోవైపు రెగ్యులర్ షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు మహేష్.ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా టాలీవుడ్ లో ఉన్న ఐదుగురు దర్శకులతో మహేష్ సిట్టింగ్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇన్ నేపథ్యంలో రీసెంట్ గానే పార్క్ హాయాత్ హోటల్ లో ప్రత్యేకంగా దర్శకులను కలుసుకున్నట్లు సమాచారం.తదుపరి షెడ్యూల్ డిస్కషన్స్ లో భాగంగా డైరెక్టర్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.త్రివిక్రమ్ తో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయాల గురించి చర్చలు జరిపారట.ఇక ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో అలాగే క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేనితో ఫ్రెండ్లీ గా కలిసినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఇద్దరు దర్శకులు కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇక మరోవైపు అనుకోకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా తో మహేష్ బాబు మాట్లాడినట్లు సమాచారం.సందీప్ వంగా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.

 గతంలో ఒకసారి ఈ విషయమై మహేష్ తో సందీప్ మాట్లాడటం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సందీప్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.అలా  ఒకేసారి ఐదుగురు దర్శకులతో మహేష్ బాబు సిట్టింగ్స్ చేయడం ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారింది.ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. సర్కారు వారి పాట షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: