చిరంజీవితో నటించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని అందరికి తెలుసు.. కాకపోతే ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన డి.రామానాయుడు ఎన్నో చిత్రాలను నిర్మించి ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారని తెలుస్తుంది.

ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాలలో తాను కూడా నటించానని తెలిపాడట సీనియర్ యాక్టర్ సుబ్బరాయ శర్మ. సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మురళీమోహన్ నాటకం వేశారని ఆయన నాటకంలో నేను కూడా నటించానని ఇక అప్పుడు డి.రామానాయుడు నన్ను తన కుటుంబంలో ఒకరిగా చేర్చుకున్నారు అని తెలిపాడని చెప్పాడట..

 

ఇలా సాఫీగా చిత్రాలతో సాగుతున్న సందర్భంలో ధర్మచక్రం సినిమా చేస్తున్న సమయంలో ఒక 3రోజులు గ్యాప్ ఇచ్చారట..అప్పటికే చిరంజీవి నటించిన రిక్షావోడు సినిమాకు కమిట్ అయ్యానని చెప్పాడట. అయితే రిక్షావోడు ఒక రోజు షూటింగ్ అని చెప్పి ఒక్కరోజులోనే పూర్తి చేశారట.ఆ తర్వాత ఒకరోజు రిక్షావోడు సినిమా యూనిట్ వాళ్లు మళ్లీ ఫోన్ చేసి కేవలం ఒక్క రోజు షూటింగ్ మాత్రమే ఉంది అని చెప్పారని సమాచారం.. నేను కుదరదు అని చెప్పానని వాళ్ళు ఏమో లేదు ఒక్కరోజులోనే అయిపోతుందని మళ్ళీ తిరిగి వెళ్లవచ్చును అని చెప్పడంతో నేను రామానాయుడు దగ్గరికెళ్ళి పర్మిషన్ అడిగానని చెప్పాడట  

 
కానీ ఆయన ఒప్పుకోలేదని అప్పుడు నేనేమో ఎందుకు సార్ గ్యాప్ ఉంది కదా వెంటనే వెళ్లి వచ్చేస్తాను అని చెప్పినప్పుడు రామానాయుడు గారు నన్ను చూసి గ్యాప్ అని కాదు కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని మేము ప్రయత్నిస్తుంటే మీరేమో అక్కడికి వెళ్లి సినిమాలు తీస్తామని చెబుతున్నారని అన్నారట.అవసరమైతే వాళ్లనే రమ్మని చెప్పండి నేను మాత్రం పర్మిషన్ ఇవ్వనని చెప్పేశాడట రామానాయుడు గారు. వాళ్లేమో ఫోన్ల మీద ఫోన్లు చేసి ఎప్పుడొస్తారు..బయలుదేరారా లేదా..అంటూ ప్రతిసారి అడుగుతుంటే తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందని చెప్పారట.

కానీ అక్కడికి వెళితే షూటింగ్ ఆగడంతో రెండు రోజులు అక్కడే ఆగి పోయానని ఇక ఆ రోజు రాత్రికి ఫ్లైట్ బుక్ చేయమంటే ఫ్లైట్ టికెట్ లు లేవని చెప్పారట. కానీ ఎట్టకేలకు హైదరాబాద్ కు చేరుకుని రామానాయుడి దగ్గరికి వెళ్తే ఆయన నాతో మాట్లాడలేదని చెప్పారట.అలా కొన్ని సంవత్సరాలపాటు మాట్లాడకపోవడం చాలా బాధ వేసిందని ఇక చిరంజీవితో నటించడమే నాకు శాపంగా మారింది అంటూ సుబ్బరాయశర్మ తెలిపాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: