ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ ను పూర్తిగా మార్చి వేసిందని చెప్పవచ్చు. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమ దిశ ను కూడా మార్చి వేసిన సినిమాగా బాహుబలి చిత్రాన్ని అభివర్ణించవచ్చు. ఆ విధంగా ఆ చిత్రంతో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 13వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతు ఉండగా దీని గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది

ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేతిలో మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటి చిత్రీకరణ ఇప్పటికే మొదలు పెట్టుకోగా వాటిలో రెండు సినిమాలు చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా అందరూ ప్రభాస్ ఎన్ని పాన్ ఇండియా సినిమాలు మానేజ్ చేస్తున్నాడు అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రాన్ని చేస్తున్నాడు. బాలీవుడ్లో రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవి కి పూర్తి కాబోతున్నట్లు గా తెలుస్తుంది. అలా వేసవి తర్వాత ప్రభాస్ తో చేతులు కలిపి స్పిరిట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అలా ఆ సినిమాను వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేసి ఆపై వచ్చే ఏడాది విడుదల చేయాలనేది ప్రభాస్ ఆలోచన. ఈ నేపథ్యంలో వీరి స్పిరిట్ సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారు అన్న అంచనాలు ప్రేక్షకులలో ఇప్పటినుంచే మొదలయ్యాయి. అర్జున్ రెడ్డి సినిమాలో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో సినిమా చేసే స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సినిమాతో ఇలాంటి స్థాయిలో ఉంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: