నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా అఖండ. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అఖండ సినిమాలో బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ తో పాటుగా జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణలు కొన్ని ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇకపోతే బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కథ అంతా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ..

 ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండడం విశేషం. అంతేకాకుండా అఖండ, మురళీ కృష్ణ పాత్రలకు  తన స్టైల్లో డైలాగ్స్  చెప్పడం దీంతో పాటు తన నటనతో కూడా  సినిమాలో ఆ పాత్రను హిట్ చేశాడు బాలకృష్ణ. వీటితో పాటు సినిమా లో ఉన్న మ్యూజిక్ కూడా అఖండ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది అని చెప్పాలి. సినిమా విడుదల మూడు రోజులు అవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. విడుదలై మూడు నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. ఈ విషయం పక్కన పెడితే ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమాని తప్పకుండా రీమేక్ చేస్తున్నారు..

అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య నటించిన సినిమా బాలీవుడ్ కి వెళ్లనుందట. సినిమా లో మంచి యాక్షన్ సీన్స్ మరియు దేవాలయాల పరిరక్షణ, హిందుత్వం గురించి కొన్ని ముఖ్యమైన సీన్లు ఉండటంతో..నార్త్ ఇండియన్ ఆడియన్స్‌కి  ఈ సినిమాను బాగా ఇష్టపడతారు. అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే కొందరు బాలీవుడ్ దర్శకులు ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ బాలీవుడ్ లో ఏ సినిమా వస్తే ఈ సినిమాలో హీరోలుగా అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ వంటి హీరోలు చేస్తారని నేను సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: