కేవలం తెలుగు సినిమా ప్రేక్షకుల మాత్రమే కాదట ఇండియన్ సినిమా ఆడియన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్న ట్రిపుల్ ఆర్‌ ట్రైలర్ విడుదలైందని తెలుస్తుంది.

దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత తెలుగు సినిమా పవర్ అంటే ఏంటో మరోసారి నిరూపించారు రాజమౌళి అని అంతా అనుకుంటున్నారట.. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా కూడా పూర్తి స్థాయిలో సత్తా చూపించలేకపోయిందట.మధ్యలో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించిన కూడా పునర్వైభవం అయితే ఇప్పటి వరకు రాలేదట.. ఈ లోటు తీర్చడానికి ఇప్పుడు ట్రిపుల్ ఆర్‌ సినిమా వచ్చేస్తుందని తెలుస్తుంది.అందుకే టీజర్, ట్రైలర్‌లో కూడా బ్రింగింగ్ బ్యాక్ ఇండియన్ సినిమా గ్లోరీ అంటూ వేశారట.అంటే ఇండియన్ సినిమాకు పునర్వైభవం తీసుకొచ్చే సినిమా ఇదేనని దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ చేశారట.

ఇదిలా ఉంటే జనవరి 7న rrr సినిమా విడుదల కానుందట.రాబోయే నెల రోజులు పూర్తిగా ప్రమోషన్ కోసమే కేటాయించారట దర్శకుడు రాజమౌళి. అందులో భాగంగా సినిమా విడుదలకు ముందు మూడు ప్రధానమైన ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారట అందులో మొదటిది ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రెండోది హిందీ ఈవెంట్ అని మూడోది అత్యంత ప్రధానమైనది సినిమా విడుదలకు వారం రోజుల ముందు ప్లాన్ చేస్తున్నారట.డిసెంబర్ 15న వరంగల్‌లో ట్రిపుల్ ఆర్‌ సినిమా రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం.అలాగే 25న ముంబైలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్, అభిమానుల సమక్షంలో భారీగా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.. దీని కోసం ఏపీ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మూడు వేల మంది అభిమానులు ప్రత్యేక ట్రైన్‌లో ముంబై తీసుకెళ్లనున్నారట.. ఇక చివరగా జనవరి 1 లేదా 2వ తేదీల్లో హైదరాబాద్ లో అత్యంత వైభవంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.ఈ మూడు ఈవెంట్స్ తర్వాత సినిమా విడుదల కానుందట.. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారని తెలుస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా 15 వేలకు పైగా థియేటర్స్‌లో ట్రిపుల్ ఆర్‌ సినిమా విడుదల కానుందట.తెలుగులో సంక్రాంతికి ట్రిపుల్‌ ఆర్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు విడుదల కానున్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: