అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా కియారా అద్వానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో  భరత్ అనే నేను, వినయ విధేయ రామ అనే రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలలో భరత్ అనే నేను సినిమా మంచి విజయాన్ని అందుకోగా, వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇలా వరుసగా రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కీయారా అద్వానీ , ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను ఫుల్ స్పీడ్ లో ముందుకు తీసుకు వెళుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ, రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కియారా అద్వానీ భూల్ భూలయ్యా-2’  అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించగా, టబు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు 180  కోట్ల వరకు కలెక్షన్ లను సాధించినట్లు తెలుస్తోంది.  కియారా అద్వానీ ఈ మూవీ లో రీత్ ఠాకూర్ అనే పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు గాను కియారా అద్వానీ 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా కోసం కియారా అద్వానీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: