తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు మేఘ పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆచార్య.ఇకపోతే వీరు నటించిన ఈ సినిమా   కొరటాలకు భారీ ఝలక్ ఇచ్చింది. అయితే ఆ చిత్రాన్ని ఆయన తలాతోకా లేకుండా తెరకెక్కించాడని విమర్శలు వినిపించాయి.అయితే  చిరంజీవి, చరణ్ కెరీర్ లో వరస్ట్ మూవీగా ఆచార్య నిలిచిపోయింది.అంతేకాక ఆచార్య బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది.ఇక  ఈ క్రమంలో ఎన్టీఆర్ మూవీతో కమ్ బ్యాక్ కావాలని కొరటాల భావిస్తున్నారు.కాగా ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ పకడ్బందీగా తయారు చేస్తున్నారు. పోతే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే  ఇక కొరటాల చిత్రం కోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నట్లు సమాచారం.ఇకపోతే ఎన్టీఆర్ 30(NTR 30) ప్రీ లుక్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్ 30 అనంతరం దర్శకుడు కొరటాల హీరో ప్రభాస్ తో మూవీ చేసే అవకాశం కలదంటున్నారు. అయితే ఈ మేరకు చర్చలు జరగ్గా మేకర్స్ ప్రణాళికలు వేస్తున్నారట. పోతే ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో మూవీ ఖాయమేనన్న మాట వినిపిస్తుంది.అయితే  ఇక దర్శకుడిగా కొరటాలకు మొదటి చిత్రం ప్రభాస్ తోనే కావడం విశేషం.అంతేకాదు  2013లో విడుదలైన మిర్చి మూవీతో రైటర్ కొరటాల దర్శకుడయ్యాడు.ఇదిలావుంటే మిర్చి భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే.

అయితే  మరి ఈ కాంబినేషన్ లో మరలా మూవీ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ సైతం కొరటాల దర్శకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నారు. కాగా ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇదిలావుంటే ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండగా, సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుపుకుంటున్నాయి. అంతేకాదు అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇక మారుతి దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే కొరటాలతో ప్రభాస్ మూవీ మూడేళ్ల తర్వాత ఉండవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: