రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సలార్ లో  హీరో గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ,  ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు .

పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వున్న ప్రభాస్మూవీ లో హీరోగా నటించడం , కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం తో ప్రస్తుతం సలార్ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి . ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో మలయాళ స్టార్ నటుడు అయి నటువంటి పృథ్వి రాజ్ సుకుమారన్  కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది .

ఈ షెడ్యూల్ షూటింగ్లో పృథ్వీరాజ్ సుకుమారన్  కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది . ఇలా ఇప్పటికే భారీ అంచనాలు కలిగి ఉన్న సలార్ మూవీ లో పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి గొప్ప  నటుడు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు మరింత గా పెరిగి పోతున్నాయి . ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్మూవీ ని అదిరి పోయే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: