తెలుగు యువ హీరో లలో ఒకరు అయినటు వంటి శ్రీ సింహ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ సింహ  , రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా మూవీ తో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మత్తు వదలరా మూవీ తో శ్రీ సింహ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ మూవీ తో అద్భుతమైన గుర్తింపు ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ యువ హీరో సంపాదించు కున్నాడు. ఆ తర్వాత శ్రీ సింహ 'తెల్లవారితే గురువారం' అనే మూవీ లో హీరో గా నటించాడు.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ సింహ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కాక పోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం చెప్పుకో దగ్గ కలెక్షన్ లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ 'ఓ టి టి' హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి నేట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు కొన్ని వారాల ధియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: