నందమూరి
బాలకృష్ణ ఇప్పటిదాకా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. జానపద సాంఘిక సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పుడు ఈ స్థాయి హీరోగా ఎదిగిన ఈ
హీరో ఇప్పుడు
మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర
సింహా రెడ్డి అనే సినిమాను చేసిన
బాలకృష్ణ తొందరలోనే ఆ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అఖండ
సినిమా సంచలన విజయమందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి
దానికి తోడు ఈ
సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా ఈ
సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుంది అని నమ్మకాన్ని నందమూరి అభిమానులు కలిగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నందమూరి
బాలకృష్ణ చేయబోయే తదుపరి సినిమాల గురించి వార్తలు వినిపిస్తున్నాయి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను
జనవరి నుంచి మొదలుపెట్టబోతున్న నందమూరి
బాలకృష్ణ ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్
సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన కెరియర్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన
ఆదిత్య 369
సినిమా యొక్క సీక్వెల్ చేయాలని నందమూరి
బాలకృష్ణ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఆయన 100వ సినిమాగా ఈ చిత్రం యొక్క సీక్వెల్ చేయాలని భావించారు కానీ అది కుదరలేదు. దాంతో ఇప్పుడు ఆయన ఈ
సినిమా యొక్క సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు
ఆదిత్య 999 అనే సినిమాను ఆయన చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయం త్వరలోనే తెలియనుంది.
ఆదిత్య 369
సినిమా చేసిన సంగీతం శ్రీనివాసరావు వయసు అయిపోవడంతో ఆయన ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించడు అనే విషయమై క్లారిటీ వస్తుంది. మరి ఈ తరం దర్శకులలో ఎవరు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తారో చూడాలి