బాలీవుడ్ లాంటి
సినిమా పరిశ్రమలోకి వెళ్లి నటించాలని అన్ని భాషలలోనీ నటీనటులకు ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని హీరోలు నటులు అందరూ కూడా తెలుగులో నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగు
సినిమా పరిశ్రమ నుంచి పాన్
ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ చిత్రాలలో నటించాలని అందరూ కోరుకుంటున్నారు.
ఆ విధంగా ఇప్పుడు
బాలీవుడ్ హీరోలైన కొంతమంది తెలుగు సినిమాలలో నటిస్తూ ఉండడం తెలుగు
సినిమా పరిశ్రమ స్థాయిని పెంచినట్లు అవుతుంది. ఇప్పటికే చాలామంది
బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాలలో నటిస్తూ ఉండగా ఇప్పుడు హీరోలు నటీనటులు కూడా ఇక్కడ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బాబీ డియోల్ వంటి అలనాటి హీరోలు ఇప్పుడు బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. వారు ఇప్పుడు తెలుగులో విలన్లుగా చేయడానికి సిద్ధమవుతున్నారు.
బాబీ డియోల్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో వీలైన పాత్రలో నటించడానికి అంగీకరించగా
అర్జున్ రాంపాల్ కూడా ఇప్పుడు మరొక తెలుగు సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు. ఆయన హరిహర వీరమల్లు సినిమాలో ఇప్పటికే ఓ పాత్ర చేస్తూ ఉండగా ఇప్పుడు తాజాగా మరొక సినిమాలో ఆయన విలన్ పాత్ర చేస్తూ ఉండడం ఆ
సినిమా యొక్క
మార్కెట్ పెరుగుతుంది అని చెప్పవచ్చు. వీరు మాత్రమే కాకుండా అమితాబచ్చన్
ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అందులో
హీరోయిన్ గా నటిస్తుంది
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే. ఇక ఇప్పటికే
అజయ్ దేవగన్ వంటి
హీరో తెలుగు సినిమాల్లో నటించాడు. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇదే కొనసాగితే మాత్రం తప్పకుండా
టాలీవుడ్ దేశంలోనే అత్యుత్తమ
పరిశ్రమ అవుతుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.