కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తెగింపు చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తదుపరి చిత్రంపై కూడా అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా చేయడానికి ఇప్పటికే అన్ని సన్నహాలు పూర్తయ్యాయి. #AK 62 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు అజిత్ తెగింపు సినిమా థియేటర్లలో విడుదలయ్యి.. సందడి చేస్తున్న నేపథ్యంలో.. అజిత్ తన 62వ చిత్రానికి సంబంధించి సినిమాలో ఎవరెవరు భాగం పంచుకోబోతున్నారు అనే విషయాన్ని డైరెక్టర్ విగ్నేష్ శివన్ రివీల్ చేయడం జరిగింది.

ఈ క్రమంలోనే ఇందులో అరవిందస్వామి,  సంతానం,  కాజల్ అగర్వాల్ తో పాటు పలువురు ప్రముఖులు నటీనటులుగా నటించనున్నారు అని విగ్నేష్ శివన్ వెల్లడించారు. ఇకపోతే ముందుగా ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు.  అయితే కొన్ని కారణాలవల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.  నిజానికి త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమెకు వరుస అవకాశాలు వెలువడుతున్నాయి.  ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్లు ఉన్న నేపథ్యంలో అజిత్ 62 సినిమాలో నటించడానికి ఆమె నిరాకరించింది.

ఈ క్రమంలోనే  విగ్నేష్ తన భార్య సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలని ప్రయత్నం చేశారు.  కానీ అది కూడా కుదరలేదు.  అందుకే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ను సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే కాజల్ అగర్వాల్.. కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.  వివాహం జరిగి ఒక బాబు జన్మించిన తర్వాత సినిమాలలో బిజీ కావడానికి ప్రయత్నం చేస్తుంది . ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: