ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అహ తాజాగా న్యూస్ పేపర్లు లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా అల్లు అరవింద్ ప్రకటించడం జరిగింది. ఓటీటీ సంస్థలలో ఆహా ప్రస్తుతం ముందు వరుసలు దూసుకుపోతోంది .వైవిధ్యమైన కంటెంట్లను అందిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంది. ఈ సంస్థ ఇప్పుడు తాజాగా తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సంస్థ మీడియా రంగంలోకి కూడా ప్రవేశించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి న్యూస్ పేపర్లు లాంచ్ చేయబోతున్నట్లు అరవింద్ ఆహా ట్విట్టర్ నుంచి వెల్లడించడం జరిగింది.అందుకు సంబంధించిన ఒక ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.



ఆహాకు చెందిన అధికార ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు అల్లు అరవింద్..  ఈ ట్విట్ విషయానికి వస్తే ఉదయం ఒక చేతిలో కాఫీ మరొక చేతిలో పేపర్ ఆహా ఆ ఊహ చాలా బాగుంది కదా అంటూ.. అందుకే మీ ముందుకి ఆహ దినపత్రికతో రాబోతున్నాము అన్నట్టుగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ వార్తాపత్రికకు సంబంధించి లోగో ను కూడా షేర్ చేశారు అల్లు అరవింద్.. ఆహ నుంచే లోగో రావడంతో అభిమానులు మీడియా సంస్థలు దృష్టిని ఆకర్షిస్తోంది.చాలామంది ఈ కొత్త పేపర్ పైన స్పందించడం జరిగింది. కొంతమంది ఏప్రిల్ ఒకటవ తేదీన ఫుడ్స్ డే సందర్భంగా అల్లు అరవింద్ ఇలా ప్రకటన వెలువడిచారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ ప్రకటన ఫ్రాంక్ అని మరికొంతమంది అనగా కొంతమంది మాత్రం జనసేన పార్టీకి సపోర్టుగా చేస్తున్నారేమో అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఫ్రాంకా లేకపోతే నిజమా అనే విషయం తెలియాల్సి ఉంది ఇదంతా ఇలా ఉంటే వినాధ రంగంలో ఏప్రిల్ ఫూల్స్ చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది ఇలా ఆహా కూడా ఇలాంటి ట్రిక్కునే ప్లే చేసిందేమో అంటూ కామెంట్ చేస్తున్నారు మరి అసలు విషయాన్ని అల్లు అరవింద్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: