యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్ -2. ఇందులో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా హృతిక్ రోషన్ కూడా నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోలు లేకుండానే ఈ సినిమా షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ సెట్లోకి హృతిక్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.



సినిమా కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు హృతిక్ రోషన్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. తాజాగా వార్-2 సినిమాని విడుదల తేదీ సమయాన్ని సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తెలియజేయడం జరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతోందని అందరూ భావించారు కానీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మరింత పొడిగించడం జరిగినట్లు తెలుస్తోంది.


సినిమా 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది అంటూ తెలియజేయడం జరిగింది ఈ రిలీజ్ డేట్ చాలా లాంగ్ వీకెండ్తో వస్తోంది. అంటే గురువారం రోజున ఈ సినిమా విడుదల అవుతుంది అంటు తెలియజేయడం జరిగింది ఇక ఆ మరుసటి రోజున ఇండిపెండెన్స్ డే కావడంతో పాటు..16,17 వీకెండ్ కావడం చేత వార్-2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సెండ్ సైతం అందుకని అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. YRF స్పై యూనివర్సిటీలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రం మొత్తానికి ఎన్టీఆర్ విలన్ గా నటించబోతున్నారని.. సల్మాన్ ఖాన్, షారుక్, హృతిక్ రోషన్ అందరూ కలిసి ఎన్టీఆర్ ని ఓడించడానికి పోరాటం చేస్తూ ఉంటారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: