మ్యాచోస్టార్ గోపీచంద్ తాజాగా హర్ష దర్శకత్వంలో రూపొందిన భీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయ్యింది.

దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇలా థియేటర్ ల వద్ద ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే" ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీ నుండి హాట్ స్టార్ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీ కంటే ఒక రోజు అనగా ఏప్రిల్ నాలుగో తేదీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" విడుదల గురించి ఎంతో మంది సినీ ప్రేమికు లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc