మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్ కి ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం మాస్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మూవీ ల ద్వారానే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థానానికి చేరుకున్నాడు. ఇకపోతే ఈయన నుండి ఎక్కువ శాతం ప్రేక్షకులు కామెడీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్ లను ఇష్టపడుతుంటారు. కానీ రవితేజ మాత్రం ఈ మధ్య వరుస పెట్టి యాక్షన్ ప్లస్ మాస్ జోనర్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈయన నుండి ఒక పక్క ఎంటర్టైనర్ మూవీ వస్తే బాగుంటుంది అని ఎంతో మంది ప్రేక్షకులు ఆశపడుతున్నారు.

ఇకపోతే రవితేజ కూడా అలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ కే తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... పోయిన సంవత్సరం శ్రీ విష్ణు హీరో గా రామ్ అబ్బరాజు దర్శకత్వం లో రూపొందిన సామజవరగమన సినిమా అట్ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఫ్యామిలీ అంశాలతో పాటు కామెడీ కూడా ఫుల్ గా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాకు భాను భోగవరపు కథను అందించాడు. తాజాగా ఈ కథ రచయిత మాస్ మహారాజా రవితేజ కు ఒక అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కథను వినిపించినట్లు ... ఆ కథ విన్న వెంటనే ఈ సినిమాలో నటించడానికిరవితేజ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ కి ప్రముఖ కథా రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: