నిన్న హైదరాబాద్లో గద్దర్ అవార్డ్స్ చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి . శనివారం అనగా జూన్ 14వ తేదీ రాత్రి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ ఈవెంట్ చాలా ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే . ఈ ఈవెంట్ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత చక్కగా చేశారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి - బాలకృష్ణ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై ఈ ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చారు . ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ - అల్లు అర్జున్ స్టెజీకి ముందు వరుసలో కూర్చుని ఏదో సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తమన్ స్టేజ్ పై స్పెషల్ ప్రోగ్రాం ఇస్తూ పలు సినిమాలలోని సాంగ్స్ పాడి అలరించారు . దీంతో తమన్ పాటలు పాడేటప్పుడు .. బాలకృష్ణ ..అల్లు అర్జున్ ని చూపిస్తూ  అల్లు అర్జున్ వెళ్లి స్టేజిపై స్టెప్పులు వెయ్ వెళ్ళు అంటూ సరదాగా ఆట పట్టిస్తున్న ఓ వీడియో వైరల్ అవుతుంది.

నిన్న గద్దర్ అవార్డ్స్ వేడుకలో బన్నీతో బాలయ్య చేసిన  హడావిడి మామూలుగా లేదు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . "అల్లు అర్జున్ అమ్మో వద్దు అంటూ అనడం.. బాలయ్య కమాన్ వెళ్ళు వెళ్ళు అనడం .. సరదాగా మాట్లాడుకోవడం..వీడియో రికార్డ్ అవ్వడంతో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ - బాలయ్య ఫ్యాన్స్ ఈ క్యూట్ వీడియోని వైరల్ చేస్తున్నారు . మరెందుకు ఆలస్యం ఆ స్పెషల్ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: