టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన మాస్ మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పడు వరుస హిట్స్‌తో టాలీవుడ్ మాస్ ఆడియన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పూరి, ఇటీవల మాత్రం తడబడిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తో రేంజ్ మార్చేసిన పూరి, ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పెద్ద షాక్‌కి గురయ్యాడు. ఈ రెండు సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా నిలవకపోవడంతో పూరి కెరీర్‌పై పెద్ద ప్రశ్నార్థకం ఏర్పడింది. అయితే ఈసారి మాత్రం పూరి “కమ్ బ్యాక్” అనేది ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన తన స్టైల్, మేకింగ్ పద్ధతులనే రిఫ్రెష్ చేసుకుంటూ, పాత పూరిని తిరిగి గుర్తు చేసేలా ప్రణాళిక వేసుకున్నాడట. ఈ ఎఫర్ట్‌లో భాగంగా ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ సినిమాను పట్టాలెక్కించాడు. ఆ హీరో ఎవరో కాదు.. సౌత్‌లో వెర్సటైల్ నటనతో స్టార్‌గా ఎదిగిన విజయ్ సేతుపతి.


పూరి – విజయ్ సేతుపతి కాంబినేషన్ వింటేనే మాస్ ఆడియన్స్‌కు కొత్త కిక్ వస్తోంది. ఎందుకంటే పూరి సినిమాల్లో హీరో పాత్రనే మొత్తం సినిమాకు హార్ట్‌గా తీర్చిదిద్దుతాడు. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ఇమేజ్‌పై ఆధారపడని నటుడు విజయ్ సేతుపతి చేయడం అనేది డబుల్ క్రేజీ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు పూర్తయిందట. రషెస్ చూసుకున్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని సమాచారం. “ఈసారి గట్టిగా కొడతాం” అని తన దగ్గరి వర్గాలకే కాదు, టీమ్ మొత్తానికీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడట. ఇక టైటిల్ విషయంలోనూ పూరి ఈసారి కొత్తదనాన్ని చూపిస్తున్నాడు. “బెగ్గర్”, “భవతి భిక్షాందేహి” అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. టైటిల్ విన్న వెంటనే కథలో ఏదో ఇంటెన్స్ మాస్ డ్రామా ఉండబోతోందని గమనించవచ్చు.



ఇంతటితో ఆగిపోలేదు పూరి. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేశాడు. వాటిలో ఒకటిని ఒక తమిళ్ స్టార్‌తో చేయబోతున్నాడని వినిపిస్తోంది. శివ కార్తికేయన్, సూర్య – ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఫిక్స్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ టాక్. అదేకాకుండా మరో కథను తెలుగులో ఓ యూత్ స్టార్‌కి కూడా వినిపించేందుకు సిద్ధమవుతున్నాడట.మొత్తానికి పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయం అనిపిస్తోంది. విజయ్ సేతుపతి కాంబో మూవీతో సక్సెస్ సాధిస్తే, ఒకేసారి మూడు సినిమాలు లైన్లో ఉండడం వల్ల పూరి కెరీర్ మళ్లీ మాస్ లెవెల్‌లో పుంజుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: