యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్ప బయోపిక్‌గా నిలిచిన ఈ చిత్రంలో ఆమె నటించిన సావిత్రి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కీర్తి తన అద్భుతమైన నటనతో కేవలం దక్షిణాది ప్రేక్షకులనే కాదు, మొత్తం భారతదేశాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆమెకు నేషనల్ అవార్డ్ రావడం ఆమె ప్రతిభకు పెద్ద నిదర్శనంగా నిలిచింది. ‘మహానటి’ తరువాత తన కెరీర్ మరింత ఎత్తుకు వెళ్తుందని, అగ్రశ్రేణి దర్శకులు, నిర్మాతలు తనను సంప్రదిస్తారని కీర్తి ఆశించిందట. కానీ ఆమె ఊహించని పరిస్థితి ఎదురైంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.


కీర్తి చెప్పినట్లుగా —“మహానటి తర్వాత ఇండస్ట్రీలో నా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనుకున్నాను. కానీ పరిస్థితి ఏమైందంటే… చాలా మంది నన్ను అదే తరహా పాత్రల్లో మాత్రమే ఊహించడం ప్రారంభించారు. నన్ను ఒక ప్రత్యేకమైన, క్లాసికల్ క్యారెక్టర్ ఇమేజ్‌లో బంధించేశారు. అందుకే కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు రాలేదు” అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు,“మహానటి విడుదలైన తర్వాత దాదాపు ఆరు నెలలు వరకూ ఒక్క కథ కూడా చెప్పలేదు. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయింది. కానీ నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం ఇమేజ్ కారణంగా అవకాశాలు తగ్గిపోయాయి. దాన్ని నేను నెగిటివ్‌గా కాక, పాజిటివ్‌గా తీసుకున్నాను” అని చెప్పింది.



ఈ గ్యాప్ సమయంలో కీర్తి తన శైలిలో, బాడీ లాంగ్వేజ్‌లో, ఫిట్‌నెస్‌లో పూర్తి స్థాయి మార్పులు చేసుకుంది.“ఆ సమయాన్ని నేను పూర్తి మేకోవర్‌ కోసం ఉపయోగించుకున్నాను. కొత్తగా చూసే విధంగా నా ప్రెజెంటేషన్ మార్చుకున్న తర్వాతే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ సినిమాల వల్ల నా రేంజ్ మళ్లీ పెరిగింది” అని ఆమె వెల్లడించింది.



అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఈ విషయాన్ని వెటకారంగా మార్చారు.“నీకు నేషనల్ అవార్డ్ వచ్చినా దేనికి పనికిరాలేదు కదా?” .. “ఒక పాత్ర బాగా చేశావు… కానీ అందుకే అందరూ అదే పాత్రల్లో వేయాల్సిన అవసరం లేదు” అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, కీర్తి అభిమానులు మాత్రం ఆమె మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో టైప్‌కాస్టింగ్ ఒక పెద్ద సమస్య… ఒకసారి గ్లామర్ రోల్ చేస్తే గ్లామర్ రోల్ మాత్రమే, ఒకసారి క్లాసీ పాత్ర చేస్తే అలాంటి పాత్రలే ఇస్తారని వాళ్లు సమర్థిస్తున్నారు.ఏదేమైనా,‘మహానటి’తో దేశాన్ని మెప్పించిన కీర్తి సురేష్ ఎదుర్కొన్న ఈ ఒత్తిడి, గ్యాప్, మేకోవర్ – ఇవన్నీ ఆమె కెరీర్‌లో మరో కొత్త మలుపు తిప్పాయి. ప్రస్తుతం ఆమె మళ్లీ   వరుసగా సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: