స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుందని చాలా రోజుల క్రితమే కన్ఫార్మ్ అయ్యింది. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఘట్టం పూర్తయింది అంట. అదేంటంటే బన్నీకి త్రివిక్రమ్ కథ వినిపించడం ‘గురూజీ’ కధ విని బన్నీ ఇంప్రెస్స్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచరం. టెక్నీషియన్స్, నటి నటులు ఎంపికపై ప్రస్తుతం త్రివిక్రమ్ ఫోకస్ చేస్తున్నాడని సమాచరం.


త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు రెండు పెద్ద మ్యుజికల్ హిట్స్ అవ్వడంతో మరల దేవిశ్రీ ప్రసాదునే తీసుకోవాలని ఆలోచనలో పడినా, అతను ఫార్మ్ లో లేకపోవడం వలన దేవికి బదులుగా తమన్ ను తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.


హీరోయిన్ విషయానికి వస్తే కైరా అద్వాని, రష్మిక మందన పేర్లు పరిశీలిస్తున్నారంట. ఈ సినిమాను హారిక హాసిని, గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తారంట. మొత్తానికి బన్నీ కొత్త జోష్ తో కొత్త సినిమా మన ముందికి రాబోతుంది అనమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: