ఇక  తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడం.. ఈనెల జీతాలకు కష్టమైపోతున్న పరిస్థితుల్లో కేసీఆర్ కి మరో గట్టి షాకిచ్చాడు మోడీ.ఇక ఇప్పటికే ఎక్కడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా ఆంక్షలు విధించిన మోడీ సర్కార్.. ఎంత బతిమిలాడుతున్నా కూడా అసలు కనికరించడం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ ప్రధాని మోడీని ఎదురిస్తుండడంతో అంతే స్థాయిలో కేంద్రం తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై గట్టి దెబ్బలను కొడుతోంది.జూన్ నెలలో జీతాలకు చాలా కష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడం ఇప్పుడు గగనంగా మారింది. అలాగే ఇక ఈనెల రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధుకు డబ్బుల్లేని పరిస్థితి. దీనికి దాదాపు 7వేల కోట్ల  డబ్బులు చాలా అవసరం.. ఆ జీతాలు పెన్షన్లకు 3వేల కోట్లకు పైగా కావాలి.ఇక వీటిని ఎలా సర్దుబాటు చేయాలి? ఎక్కడ అప్పుపుట్టించాలన్న దానిపై కేసీఆర్ సర్కార్ బాగా మల్లగుల్లాలు పడుతోంది.చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్న వేళ మోడీ సర్కార్ తాజాగా సీఎం కేసీఆర్ కు మరో షాక్ ఇచ్చింది.



కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలను తాజాగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక దీని ద్వారా కనీసం 2వేల కోట్లకు పైగా వస్తాయని సీఎం కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 86912 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్రాలకు విడుదల చేసింది.ఈ వాటాలో తెలంగాణ ప్రభుత్వానికి కేవలం రూ.296 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు మాత్రం అయితే అసలు ఏకంగా రూ.3199 కోట్లు విడుదల చేసింది. ఇక ఇది కేసీఆర్ సర్కార్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. ఏపీకి ఏకంగా అన్ని వేల కోట్లు ఇచ్చి తెలంగాణకు ముష్టి 300 కోట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈ నెల ఎలా గడుస్తుందా? అని కేసీఆర్ సర్కార్ ఏం చెయ్యలేక తలపట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: