ఎక్కడైన సినిమా వాళ్ళు కనిపిస్తే ఆగలేని జనం ఇక సినిమాల్లో నటించే హీరోయిన్స్ గాని మిగతా నటీమణులు గాని కనిపిస్తే ఆగుతారా? అసలే ఆగరు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలంటూ ఫ్యాన్స్ మీదపడిపోతుంటారు. ఇక సెలబ్రిటీలు బాడీగార్డ్స్ లేకుండా బయటికి వెళితే వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఎందుకంటే వారి పై ఉన్న అభిమానం వారిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఇప్పుడు ఓ ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ కి ఫ్యాన్స్ వల్ల షాకింగ్ సంఘటన ఎదురైందట..

 

 

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదేమంటే రాయ్‌పూర్ కు  ఈవెంట్‌ కోసమని వెళ్లిన ఈమెను చూసిన అక్కడి ఫ్యాన్స్ చుట్టుముట్టేశారట. ఆ సమయంలో ఈ నటి చుట్టూ బాడీగార్డ్స్ కూడా లేరట. ఈ క్రమంలో ఫ్యాన్స్ మీదకు వచ్చేసరికి నా ఒంటి మీద దుస్తులన్నీ ఒక్కొక్కటికీ జారిపోయాయి. దాంతో వాళ్లే అడ్డుగా నిలబడి నా మానాన్ని కాపాడారు. ఆ సంఘటనతో నేను కొన్ని రోజులు షాక్‌లో ఉండిపోయాను’ అని తెలిపారు పాపం ఈ నటి.

 

 

ఇకపోతే శ్వేతా తివారీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె టీవీ రంగాన్ని ఎన్నో ఏళ్లుగా ఏలుతున్నారు. ‘కసౌటీ జిందగీ కే’ అనే సీరియల్‌తో శ్వేతాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.. ఇకపోతే ఈ నటి ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సాగుతున్నా పర్సనల్ లైఫ్ వల్ల తలెత్తుకుని తిరగలేకపోతున్నారట. ఎందుకంటే మొదట ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో ఓ కూతుర్ని కన్న తర్వాత అతనితో గొడవలు వచ్చి విడిపోయాక   మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

 

 

అతనితో కూడా ఓ కొడుకుని కన్న కొద్ది రోజుల తర్వాత అతను శ్వేత కూతురిపై చేయి చేసుకుని హింసిస్తున్నాడని కేసు పెట్టింది. ఈ వివాదం ముదరడంతో ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతోందట. ఎంత ఫాలోయింగ్ ఉంటే మాత్రం ఏంటి కావలసిన విధంగా జీవితం సాగకున్న, అందులో సంతోషం లేకున్నా ఎంతున్న పేదలే అని పెద్దలు అంటారు. ఇలాంటి సంఘటనలను చూస్తే నిజమే అనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: