ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది సీఎం జగన్ ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ తో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు పోల్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన డోనాల్డ్ ట్రంప్ కి ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కు ఎలాంటి తేడా లేకుండా పోయింది అంటూ అచ్చన్నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్ వణికిపోతున్నారు అని... స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా తీర్మానం చేయడం ట్రంప్ తరహా పోకడలకు నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో ఒక్కరోజు కూడా మాస్కు పెట్టుకోని సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు నిర్వహించము అంటూ చెప్పడం సిగ్గుచేటు అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించగా లేని కరోనా కేవలం ఏపీ లోనే స్థానిక ఎన్నికలకు అడ్డువచ్చినదా అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామిక విధానాలతో జగన్ ముందుకు సాగుతున్నారు అంటూవిమర్శలు గుప్పించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల తరపున పోరాడేందుకు టీడీపీఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి