భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ మొదలు పెట్టిన తర్వాత ఎవరికీ ఇవ్వాలి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది .. అయితే తాజాగా   మొదటి ప్రాధాన్యతలో టీకా ఎవరికీ వేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ఇంతకీ వాళ్ళు ఎవరో కాదు . 2021లో జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లే  క్రీడాకారులు, మరియు కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.  2020లోనే ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కానీ, రోనా కారణంగా ఒలంపిక్స్ వాయిదా పడ్డాయి .. 2020  లో జరగవలసినవి  కాస్తా  2021కి వాయిదా పడ్డాయి .  అయితే పూర్తి భద్రత నడుమ   2021 జూలై 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో  కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ప్రజల్లో సందేహం నెలకొంది. మనమే ఒకసారి ఆలోచిస్తే ఎవరికీ కేంద్రం ముందు ప్రాధాన్యతని ఇస్తుందో తెలిసిపోతుంది ..  మీరు డాక్టర్, నర్సులు, కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించే వారు అయితే మీకు తొలిదశలోనే కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది. మీరు ఆర్మీ లేదా పోలీస్ అయితే  మరియు  మున్సిపల్ వర్కర్ టీచర్ అయితే మీకు ఆ తర్వాత ప్రాధాన్యం లభిస్తుంది...అలాగే మీరు  మీరు 50 ఏళ్ల కంటే పెద్దవారు అయితే, తదుపరి ప్రాధాన్యం మీకే ఇస్తారు.

ఒకవేళ  మీరు కోవిడ్ 19 హాట్ స్పాట్ లో ఉండే వారు అయితే, మీకు టాప్ ప్రయారిటీలో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. పైన చెప్పిన వాటిలో ఏ కేటగిరీకి చెందని వారు అయితే, మీకు కరోనా వ్యాక్సిన్   ఆలస్యంగా వస్తుంది.అయితే, అసలు వ్యాక్సిన్ ఎప్పటి నుంచి  వేయడం ప్రారంభిస్తారని విషయాన్నీ కేంద్రం ఇప్పటివరకు చెప్పడం లేదు ... ప్రస్తుతం దేశంలో పలు రకాల వ్యాక్సిన్లు ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలో ఏ వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేదానిపై కూడా క్లారిటీ లేదు. మరి కేంద్రం పార్లమెంటరీ ప్యానల్ చెప్పినట్టు చేస్తుందా అంటే ఆలోచించదగ్గ విషయమే .. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుందో ..

మరింత సమాచారం తెలుసుకోండి: