మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వేదికపై ఉండబోతున్నారు. ప్రతి ఏటా బిజెపి సీనియర్ నేత, ఎమ్.పి బండారు దత్తాత్రేయ దసరా సందర్బంగా అలయ్ బలయ్ నిర్వహిస్తారు. ఈసారి తెలంగాణ ఆవిర్భావ అలయ్ బలయ్ జరుపుతున్నామని దత్తాత్రేయ చెప్పారు.ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తో పాటు కెసిఆర్,చంద్రబాబు, వెంకయ్య నాయుడు ప్రభృతులు పాల్గొంటారని ఆయన చెప్పారు.ఇంతకుముందు ఎప్పుడూ ఉద్యమ పాటలతో అలయ్ బలయ్ హోరెత్తేది, ఉద్యమ నేతలు,సాంస్కృతిక బృందాలకు ప్రాధాన్యత ఉండేది.మరి ఈసారి అదికారిక హోదాలో నడుస్తున్నది. మొదటి సారిగా గవర్నర్ నరసింహన్ , చంద్రబాబు వంటివారు హాజరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: