ఇప్పటి నుండే అభ్యర్థులకు గెలుపు ఓటముల గురించి ఆలోచన మొదలైంది. ఇదంతా ఇలా ఉండగా ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటినుండి అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో వైసీపీ నాయకుల బెడద ఎక్కువైంది. అధికారం చేతిలో ఉంది కదా అని వారి పరిధి మేరకు అభ్యర్థులను బెదిరించడం, అలాగే ప్రత్యక్షంగా మీ కాళ్ళు నరికేస్తాము చేతులు తీసేస్తాము అంటూ బెదిరింపు ధోరణికి దిగడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై పలు కేసులు కూడా సదరు అభ్యర్థులు పెట్టడం జరిగింది. కొన్ని కేసులు అయితే ప్రతిపక్ష పార్టీలే చొరవ తీసుకుని పోలీసులకు చెప్పడం జరిగింది.
ప్రస్తుతం అనంతపురం రూరల్ మండలానికి చెందిన టీడీపీ అభ్యర్థి భర్త ఆదినారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మొదటి విడతగా రూరల్ పంచాయితీలో వార్డ్ మెంబర్ గా ఆదినారాయణ భార్య సావిత్రమ్మ నామినేషన్ వేయడం జరిగింది. అప్పటి నుండి ఆమెకు మరియు ఆమె భర్తకు వైసీపీ కార్యకర్తల నుండి బెదిరింపులు మొదలయ్యాయి. అంతే కాకుండా అక్కడి పోలీసుల నుండి కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. ఆదినారాయణ కుటుంబ సభ్యులు పోలీసులు మరియు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే ఆదినారాయణ మృతి చెందాడంటూ ఆవేదన చెందుతున్నారు. మరి దీనిపై అటు ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి