దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని ఎలా అదుపు చెయ్యాలో తెలీక ప్రభుత్వం తల పట్టుకొని కూర్చుంది. మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు
ఆక్సిజన్ కొరత,
మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది.ఈ తరుణంలో ఈ కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 18 ఏళ్లకు పై బడ్డ వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.మరో రెండు, మూడు రోజుల పాటు వ్యాక్సిన్ వేసే అవకాశం లేదని కొన్ని రాష్ట్రాలు శనివారం ప్రకటించేశాయి. అంతటి టీకాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ కొంతమేర ఉపశమనం కలుగనుంది.
ప్రస్తుతం మన దేశంలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.కాగా ఇప్పుడు ఆ రెండింటికి తోడుగా మరో టీకా వచ్చేసింది. గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా మన దేశంలో అడుగుపెట్టేసింది.
స్పుత్నిక్ వీ భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా, వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కోసం డాక్టర్ రెడ్డీస్ రష్యాతో ఒప్పందం చేసుకోగా అందులో భాగంగా ఈ టీకాలను
డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్కు అప్పగించారు.మొత్తంగా శనివారం
రష్యా నుంచి స్పుత్నిక్ టీకాలు హైదరాబాద్కు చేరుకున్నాయి.
మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో తొలి బ్యాచ్ కింద లక్షా 50వేల టీకా డోసులు హైదరాబాద్కు తరలించారు. మరో విడతలో ఐదు మిలియన్ల వ్యాక్సిన్ డోసులు మన దేశానికి రానుండగా
మాస్కో, న్యూఢిల్లీలలోని దౌత్య వర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి.
రష్యా నుంచి భారీ సంఖ్యలో స్పుత్నిక్ డోసులు రానున్నటంతో దేశంలో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వైద్య బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.