
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని బారన్ జిల్లాలకు చెందిన యోగేశ్ తండ్రి ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. యోగేష్ డిగ్రీ బీఎస్సీ చదువుతున్నాడు. అయితే, యోగేష్ తండ్రి ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతను ట్రాక్టర్ నడపలేకపోయాడు. ఈ క్రమంలో యోగేష్ తానే స్వయంగా కొంతకాలం ట్రాక్టర్ నడిపాడు. ఈ అయితే, యోగేశ్ కి మదిలో వినూత్న ఆలోచన తట్టింది. ట్రాక్టర్ని రిమోట్ నియంత్రిస్తే ఎలా ఉంటుందని భావించాడు.
ఇక ఆ దిశగా ప్రయోగాలు చేశాడు. తొలుత బొమ్మ ట్రాక్టర్తో ప్రయోగాలు చేశాడు. తన ప్రయోగాన్ని తన తండ్రికి చూపించాడు. యోగేశ్ ఆవిష్కరించిన అతని తండ్రి అతన్ని ప్రోత్సహిస్తూ కొంత డబ్బును ఇచ్చాడు. ఆ తరువాత రిమోట్ ద్వారా ట్రాక్టర్ నడపేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉండటంతో.. యోగేశ్ తండ్రి తన బంధువులు, స్నేహితుల వద్ద డబ్బు అప్పు తీసుకువచ్చాడు. కొడుక్కి ఇచ్చాడు.
కాగా.. ఆ డబ్బుతో యోగేశ్ రిమోట్ ఆధారంగా ట్రాక్టర్ నడిచేలా ఆవిష్కరణ చేశాడు. స్టీరింగ్, గేర్, బ్రేక్స్, క్లచ్ అన్నింటినీ కంట్రోల్ చేసేలా పరికరం రూపొందించాడు. ఈ రిమోట్తో ట్రాక్టర్ను ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి నియంత్రించవచ్చునని యోగేశ్ తెలిపాడు. ట్రాక్టర్ని రిమోట్ ఆధారంగా నడిపి చూపించాడు కూడా. ఈ ఆవిష్కరణతో పొలాల్లో ట్రాక్టర్ నడపటానికి ఇకపై డ్రైవర్ ఏమాత్రం అవసరం లేదు. ఈ ప్రమోగం వల్ల డబ్బు ఆదా చేయడమే కాకుండా వ్యవసాయ పనులకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
ఆ డబ్బుతో యోగేశ్ రిమోట్ ఆధారంగా ట్రాక్టర్ నడిచేలా ఆవిష్కరణ చేశాడు. స్టీరింగ్, గేర్, బ్రేక్స్, క్లచ్ అన్నింటినీ కంట్రోల్ చేసేలా పరికరం రూపొందించాడు. ఈ రిమోట్తో ట్రాక్టర్ను ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి నియంత్రించవచ్చునని యోగేశ్ తెలిపాడు. ట్రాక్టర్ని రిమోట్ ఆధారంగా నడిపి చూపించాడు కూడా. ఈ ఆవిష్కరణతో పొలాల్లో ట్రాక్టర్ నడపటానికి ఇకపై డ్రైవర్ ఏమాత్రం అవసరం లేదు. ఈ ప్రమోగం వల్ల డబ్బు ఆదా చేయడమే కాకుండా వ్యవసాయ పనులకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఇప్పుడు తన లక్ష్యం ఆర్మీ కోసం పని చేయడమే అని చెప్పారు. భారత సైన్యం కోసం డ్రైవర్ లెస్ వార్ ట్యాంక్ నిర్మించాలనుకుంటున్నానని తన మనోగతాన్ని చెప్పాడు.