వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ ని చాలా లైట్ గా తీసుకోవడం మూలంగానే ఇప్పుడు టీడీపీ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అందుకే ఈ సారి ఎన్నికల్లో గెలిచి వైసీపీని సైడ్ చేయాలన్న ప్లాన్ తో చంద్రబాబు వరుస మీటింగ్ లను కండక్ట్ చేస్తూ ఇంచార్జి లను అలర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలో టీడీపీ ఓడిపోతే ఇక చంద్రబాబు అందు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఏమీ లాభం ఉండదు అని సొంత పార్టీ వారే కామెంట్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు అండ్ టీం ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మరియు గ్రాఫ్ ను బట్టి చూస్తే టీడీపీకి విజయావకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. వైసీపీ పై కొన్ని అంశాల వలన ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, అదేమంత ఓటమికి కారణం కాకపోవచ్చు అని సర్వే ల ద్వారా తెలుస్తోంది. ఇక బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా ఇవే ఆఖరి ఎన్నికలు అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. మరి రానున్న ఎన్నికలలో చంద్రబాబు ప్రజలను తన వైపుకు తిప్పుకుని ఎన్నికలో విజయం సాధిస్తాడా లేదా మరోసారి వైసీపీ చేతిలో ఓడిపోయి రాజకీయాల నుండి తప్పుకుంటాడా తెలియాల్సి ఉంది.