ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆయన పార్టీలో ఉన్న కీలక నేతలు అలాగే సహాయం అందిస్తున్న వారందరినీ అరెస్టు చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కాం లో చాలామందిని అరెస్టు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఏపీ అధికారులు. ఈ కేసులో పార్లమెంటు సభ్యులు, వైసిపి కీలక నేత మిథున్ రెడ్డి ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

 ఏపీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను తాజాగా అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవాలి...? ఎవరిని కలవకూడదు ? మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ అపాయింట్మెంట్ కచ్చితంగా ధనుంజయ రెడ్డి తోపాటు కృష్ణమోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిందే. లేకపోతే... జగన్మోహన్ రెడ్డిని కలవలేరు.

 అంతా పవర్ఫుల్ వ్యక్తులుగా  ఉన్న ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళిద్దరికీ  సంబంధం ఉందని a31, a 32 కింద కేసులు బుక్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన నేపథ్యంలోనే పేర్ని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఇలా వరుసగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబును జైల్లో పెట్టినట్లే వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: