
గత పది రోజుల క్రితం హైదరాబాదులోని పాత బస్తిలో ఉన్న గుల్లార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 17 మంది అగ్నికి ఆహుతైన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా అగ్ని ప్రమాదానికి గురైన బాధితులు మీడియా ముందుకు వచ్చి సంచలన నిజాలు చెప్పారు. వైద్యుల, అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అంటూ వాళ్ళు చెప్పిన మాటలు ప్రస్తుతం చాలామందికి షాకింగ్ గా అనిపిస్తున్నాయి.మరి ఇంతకీ ఆ బాధితులు ఏం మాట్లాడారంటే.. అగ్ని ప్రమాదం జరిగిన రోజు దాదాపు 6:12 కు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి లేట్ అయింది. అలా దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అంబులెన్స్ ఆలస్యం చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు వదిలారు. అలాగే అంబులెన్స్ లో ఆక్సిజన్ మాస్కుల సదుపాయం కూడా లేదు. ఫైర్ ఇంజన్ కూడా తొందరగా రాలేదు.