జగన్ కోటరీ లో ముఖ్యమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వారిలో చెవిరెడ్డి భాస్కర్  రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి .. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణ అభివృద్ధి సమస్త చైర్మన్గా పనిచేశారు .. అలాగే గతంలో కాంగ్రెస్ హయాం నుంచి ఆయన బయోస్ కుటుంబీకులు ఎవరు అధికారంలోకి వచ్చినా తుడా చైర్మన్ పదవి ఆయనే తీసుకుంటున్నారు .

దీనికి ప్రధాన కారణం ఎక్స్ అఫీషియ హోదాలో టిటిడి బోర్డులో అయిన కీలక సభ్యుడిగా ఉంటూ వస్తున్నారు .. అలా ఉంటూ చేయాల్సిన అక్రమాలు దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది . ఇక తుటా చైర్మన్గా ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని తన సొంత పనులకు విచ్చలవిడిగా ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే తన సొంత గ్రామంలో పలు పనులు చేయడానికి వ్యక్తిగత పన్నులు ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని వాడినట్లుగా లెక్కలు ఇప్పుడు బయటకు వచ్చాయి.. ఇలా మొత్తం నిధుల్లో 90% చంద్రగిరిలో పనులు చేయడానికి వాడుకున్నారట అవి కూడా తన వ్యక్తిగతంగా చేయించుకున్నట్లుగా ఇప్పుడు ఆధారాలతో బయటపడ్డాయి ..



అయితే ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఏమాత్రం కొంచెం కూడా సిగ్గు లేకుండా దొరికిపోతామన్న  భయం లేకుండా ఆ డబ్బులన్నీ  తన కంపెనీ పేరు మీదనే చేసేసారు.. డబ్బులు అన్ని తన కంపెనీ ఖాతాలోనే జమ చేసుకున్నారు. అన్నిటిపై ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ విచారణ చేపట్టింది. సమాధానాలు ఇవ్వాలని నోటీసులు పంపింది చెవిరెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకుని అవకాశాలు కనిపిస్తున్నాయి . అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి సంచలనాలు చెబుతారు ..అనేది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: