
గతంలో వైసిపి 14000 ఒకసారి 13000 మరో మూడు సార్లు ఇచ్చింది. ఇప్పుడు కూటమి 13 వేల తో ప్రారంభించింది. గతంలో వైసిపి ఇచ్చినట్టే ఇప్పుడు అమలు కావటం .. దానికి తోడు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న అందరికీ తలా 13000 ఇవ్వడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా చూస్తే తల్లికి వందనం పథకంతో సర్కారు గ్రాఫ్ అయితే పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అసలు ఇవ్వరన్న ప్రచారం నుంచి ఇస్తారన్న ప్రచారం దాకా ఇచ్చేవరకు తీసుకువచ్చిన పథకం ఇది. పేదల కుటుంబాల్లో పండుగ వచ్చేలా చేసిందని చెప్పాలి. దీనికి విధించిన నిబంధనలు తీసుకుంటే పెద్దగా వ్యతిరేకత రాలేదు. చంద్రబాబు మేలు చేస్తారన్న అభిప్రాయాలే ఎక్కువ మంది నుంచి వచ్చాయి. సో ఈ పథకం ప్రభుత్వం గ్రాఫ్ కొంత వరకు పెంచింది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు