మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 8 మందిని సైతం అరెస్టు చేసి మరి జైలుకి తరలించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తును ప్రస్తుతం వేగవంతంగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనమ్ బ్యాగులో రెండు తాళిబొట్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు ఒక్కొక్కటిగా మళ్లీ మొదలవుతున్నాయి. ఇష్టం లేకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు బలవంతంగా రాజా రఘువంశీతో సోనమ్ కి వివాహం చేయడంతో ఆమె పథకం ప్రకారమే తన భర్తను హత్య చేయించిందనే విధంగా అధికారులు తెలిపారు.


మొదట మిస్సింగ్ ఘటన నమోదు కావడంతో ఆ తర్వాత పోలీస్ అధికారులు కేసులు చేదించడంతో ఈ కేసులో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వివాహమైన తర్వాత రాజా రఘువంశి, సోనమ్ హనీ మూన్ కు మేఘాలయాలకు వెళ్ళగా మే 23న ఈ జంట కనిపించకుండా పోయారు. జూన్ 2న రాజా మృతదేహం లభించగా.. సోనమ్ ఆచూకీ మాత్రం అసలు దొరకలేదు దీంతో పోలీసులు విచారణలో సోనమ్ హత్య చేయించారనే విషయం బయటపడింది.


అయితే వివాహానికి ముందే సోనమ్ , రాజ్ కుస్వాహాను ప్రేమించిందని అయితే వీరి పెళ్లి ఇంటిలో కూడా ఒప్పుకోకపోవడంతో సోనమ్ ఒక ప్లాను వేసి తన భర్తను చంపి ప్రియుడు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుందట.. అలా తన బాయ్ ఫ్రెండ్ రాజ్ తో కలిసి తన భర్తను హత్య చేయించి మొదట మిస్సింగ్ కేసు అన్నట్లుగా సృష్టించాలని చూసిన చివరికి దొరికిపోయింది.సోనమ్ బ్యాగులో రెండు మంగళ సూత్రాలు లభించడంతో రాజా కంటే ముందుగానే సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో వివాహం అయ్యిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అయితే ఈ విషయంపై రాజా రఘువంశి సోదరుడు తన  సోదరుడిని చంపిన తర్వాతే వారు వివాహం చేసుకొని ఉండొచ్చేమో అన్నట్లుగా తెలుపుతున్నారు. సోనమ్ కుటుంబమంతా కలిసి తమని మోసం చేసిందనే విధంగా విపిన్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: