
ఈ రుణ నిధులను కుప్పం, దగదర్తి విమానాశ్రయాల కోసం భూసేకరణ, బాహ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఉపయోగించనున్నారు. శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు కూడా ఈ నిధులను వినియోగించి, ప్రాంతీయ సంపర్కాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాజెక్టుల కోసం టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీఈఎఫ్ఆర్) అధ్యయనం కుప్పం, దగదర్తి విమానాశ్రయాలకు పూర్తయింది, మిగిలిన వాటికి కొనసాగుతోంది.
ఈ నిధులతో విమానాశ్రయాల అభివృద్ధి వేగవంతం కానుంది.ఏపీఏడీసీఎల్కు వీజీఎఫ్ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) సహాయం, అత్యవసర పెండింగ్ బాధ్యతలు తీర్చడానికి కూడా ఈ రుణాన్ని వాడవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్య రాష్ట్రంలో ఎనిమిది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం. ఈ విమానాశ్రయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడతాయని అధికారులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రాజెక్టులు వేగంగా అమలు కానున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు