ఉమ్మడి కడప జిల్లాల్లోని ప్రముఖ, ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందుల నియోజకవర్గం గురించి ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. పులివెందుల టీడీపీ కంచుకోట కాబోతుంది అంటూ నంద్యాల ఎంపీ శబరి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శబరి ఈ కామెంట్లు చేయడం కొసమెరుపు. కడప, పులివెందులకు గడిచిన ఐదేళ్ళలో జగన్ ఏం చేశారో చెప్పాలని శబరి తెలిపారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం కడప, పులివెందుల ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె కామెంట్లు చేశారు.  గతంలో మోడీ సర్కార్ ఇచ్చిన 1500 కోట్ల రూపాయలను జగన్ దారి మళ్లించారని ఆమె అన్నారు.  కడపలో  స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పారని అయితే స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని శబరీ వెల్లడించారు.  వైసీపీ పాలనలో ఏం జరిగినా ఆ నెపం టీడీపీపై నెట్టారని ఆమె తెలిపారు.

వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో దోచుకోవడం మినహా ఏం జరగలేదని చెప్పుకొచ్చారు.  ఎన్నికల కమిషన్ దృష్టికి వైసీపీ కుట్రలను తీసుకెళ్లి  పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో లతారెడ్డిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. శబరి ధీమా నేపథ్యంలో పులివెందుల ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో  చూడాల్సి ఉంది.

పులివెందుల zptc ఎన్నికలను వైసీపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.  జగన్ సొంత నియోజకవర్గంలో సత్తా చాటాలని గతంలో కూడా టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వేంపల్లి మండలంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: