
ఈనెల 18 నుంచి వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి.. వైసీపీ వాళ్లు రావాలి రాకపోతే వాళ్లు అనర్హులు అవుతారు.. ఇది రాజ్యాంగంలో ఉండే రూల్ ప్రకారమే తాము అనర్హత వేటు వేస్తామంటూ తెలిపారు RRR. అప్పుడే పులివెందులలో ఉప ఎన్నికలు వస్తాయి అంటూ మాట్లాడారు. ఇప్పటివరకు 37 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపగా ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పార్టీ నుంచి ఎవరు హాజరు కాలేదు. అయితే మరి కొంతమంది అసెంబ్లీకి వచ్చినట్టుగా అటెండర్ రిజిస్టర్లు సంతకం చేసి బయటనుంచే వెళ్లిపోయారు. అయితే వాటిని మేము అనుమతి ఇవ్వమంటూ స్పీకర్ తెలిపారు.
దీంతో మరో 23 రోజుల కనుక అసెంబ్లీలోకి వీరు రాకపోతే వారు డిస్ క్వాలిఫై అవుతారు. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు 10 నుంచి 12 రోజులు జరగబోతున్నాయి. మళ్లీ డిసెంబర్లో జరిగేటువంటి శీతాకాల సమావేశాలకు కూడా ఏ ఒక్కరోజు హాజరు కాకుండా ఉంటే కచ్చితంగా అర్హత వేటుపడుతుందని తెలిపారు స్పీకర్. దీంతో 11 మంది కూడా పదవులు కోల్పోతారు. ఈ 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది..
జగన్ అసెంబ్లీలోకి రాకపోవడానికి ముఖ్య కారణం మాట్లాడడానికి మైక్ ఇవ్వరని మైక్ ఇచ్చిన కట్ చేస్తారని వెళ్లినా కూడా ఉపయోగం ఉండదు హేళన చేస్తారనే వాదన జగన్ది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కనీసం ఒక గంట అయినా ఉండి మన వాదనలు వినిపించి వచ్చేయాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ సెక్షన్ లో మాత్రం ఈసారి ఎమ్మెల్యేలు హాజరయ్యా అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారో లేదో చూడాలి. మరి ఈ 11 స్థానాలు ఉప ఎన్నికల విషయంపై వైసీపీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది..