ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలలో అటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే . ఇక అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో ఎన్టీఆర్ తో కలిసి తెలుగు ఇండస్ట్రీని మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో ఎంతగానో కృషి చేశారు అని చెప్పాలి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్లు అటు తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా కొనసాగారు అని చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు రెండు కళ్ళలాంటివారు అని ఇప్పటికీ సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.


 ఇకపోతే ఎన్టీఆర్ వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే అటు నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఇప్పటికి స్టార్ హీరో గానే కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి   అయితే చిన్నప్పటి నుంచి ఏఎన్ఆర్ అటు నాగార్జున విషయంలో కాస్త కఠినంగానే ఉండేవారట. నాగార్జునకి కష్టం విలువ డబ్బు విలువ తెలియాలని కాస్త కఠినంగానే చూసేవారట. తాను స్టార్ హీరో అయినప్పటికీ స్కూల్ కి వెళ్లే టైంలో ఇక నాగార్జునను మామూలు పిల్లల్లాగానే బస్సులో వెళ్ళమని చెప్పేవారట. కనీసం ఒక సైకిల్ కూడా కొనిచ్చేవారు కాదట ఏఎన్ఆర్.



 ఓ రోజు ధైర్యం చేసి నాగార్జున సైకిల్ కావాలని అక్కినేనిని అడిగాడట. నువ్వు మొదట ఏడవ తరగతిలో మెరిట్ మార్కులు తెచ్చుకో.. అలా అయితేనే నీకు సైకిల్ కొనిస్తా లేదంటే లేదు అని తెగేసి చెప్పాడట నాగేశ్వరరావు. నాగార్జునకు మెరిట్ రావడంతో మాటిచ్చిన విధంగానే ఏఎన్ఆర్ సైకిల్ కొనిచ్చారట. ఇక కాలేజీ సమయంలో స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ నాగార్జున మామూలు పిల్లల్లాగానే కాలేజీకి వెళుతూ ఉండేవాడట. నాగార్జున తన తండ్రి కోటీశ్వరుడు అని కష్టం విలువ డబ్బు విలువ తెలియకుండా పెరిగితే చెడిపోతాడని భావించి ఇక నాగేశ్వరరావు ఇలా కొడుకు విషయంలో కఠినంగా ఉండేవారట. అలా ఉండటం వల్లనేమో ఇక ఇప్పుడు నాగార్జున ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: