రాక్షసులందరినీ సంతరించుకుని రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. ఆ రక్తబీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వలన అతని రక్తపు చుక్క నేలపై పడితే అతి భయంకరమైన రాక్షసులు పుట్టుకొస్తారు. ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఆ రక్తబీజుడ్ని అంతమొందించేందుకు దుర్గాదేవి కదిలి వస్తుంది. ఆ భయంకర రాక్షసునితో యుద్ధం చేస్తుంది. అయితే బ్రహ్మ ఇచ్చిన వరం వలన అమ్మవారు రక్తబీజుడిని గాయపరిచిన ప్రతిసారీ అతని శరీరంనుంచి పడిన రక్తపు చుక్కల నుండి రాక్షస సైన్యం పెరుగుతూ వస్తుంది. అయితే ఆ రాక్షసులందరినీ వధిస్తున్న కొద్ది వేల మంది పుట్టుకొస్తుండడంతో దుర్గాదేవికి ఆగ్రహం వచ్చి కాళికా మాత అవతారంలోకి మారుతుంది.
రాక్షసులందరినీ సంతరించుకుని రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. ఆ రక్తబీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వలన అతని రక్తపు చుక్క నేలపై పడితే అతి భయంకరమైన రాక్షసులు పుట్టుకొస్తారు. ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఆ రక్తబీజుడ్ని అంతమొందించేందుకు దుర్గాదేవి కదిలి వస్తుంది. ఆ భయంకర రాక్షసునితో యుద్ధం చేస్తుంది. అయితే బ్రహ్మ ఇచ్చిన వరం వలన అమ్మవారు రక్తబీజుడిని గాయపరిచిన ప్రతిసారీ అతని శరీరంనుంచి పడిన రక్తపు చుక్కల నుండి రాక్షస సైన్యం పెరుగుతూ వస్తుంది. అయితే ఆ రాక్షసులందరినీ వధిస్తున్న కొద్ది వేల మంది పుట్టుకొస్తుండడంతో దుర్గాదేవికి ఆగ్రహం వచ్చి కాళికా మాత అవతారంలోకి మారుతుంది.