కాశీ విశ్వేశ్వర ఆలయం లో శివాలయంలో శివలింగం ముందు నంది లేడట.. ఇలా నందీశ్వరుడు ప్రతిష్ఠించకపోవడానికి గల కారణం ఏమిటో పురాణాలు.. ఏం చెబుతున్నాయి.. అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం..పురాణాల ప్రకారం.. భారతదేశం పై ఔరంగజేబు దండెత్తి, హిందూ దేవాలయాలు అన్నింటిని వారు ధ్వంసం చేయాలని కంకనం కట్టుకున్నాడు.. దేశంలో ఉన్న శివాలయాలు అన్నింటిని ధ్వంసం చేసుకుంటూ వచ్చిన ఔరంగజేబు చివరిగా కాశీ విశ్వేశ్వర ఆలయానికి చేరుకుని లోపు ఈ విషయాన్ని గ్రహించిన అక్కడి అర్చకులు లింగాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న కోనేటిలో శివలింగాన్ని పడేయడం జరిగింది.
కాశీ విశ్వేశ్వర ఆలయానికి చేరుకున్న ఔరంగజేబు , అతడి సైన్యం అక్కడ ఉన్న ఎంతో ప్రాముఖ్యత కలిగిన శిథిలాలు అన్నింటిని కూల్చివేసి, నందీశ్వరుడిని మాత్రం ఏమి చేయకుండా అలాగే వదిలి వెళ్ళిపోయారు. అతడి సైన్యం తో వెళ్లిపోయిన కొద్దిరోజులకు కోనేటి లో ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి తిరిగి ప్రతిష్టించాలని అనుకున్నారు.. అక్కడి అర్చకులు.. కానీ ఎక్కడ వెతికినా శివలింగం కనిపించకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో శివలింగాన్ని తీసుకువచ్చి మరొక దేవాలయాన్ని నిర్మించి అక్కడ ప్రతిష్టించడం జరిగింది.
అందుకే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకొని , ఆ తరువాత నందీశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ.